క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్తో మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఖరి వన్డేలో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. మరోసారి టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమ్ఇండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 31 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 25 పరుగులు, గిల్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిన భారత్ 0-1తో వెనకబడిపోయింది. రెండో వన్డేకి వరణుడు అడ్డు తగలడంతో మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమ్ఇండియా సిరీస్ను సమం చేయగలుగుతుంది.