హామిల్టన్: భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేను వరణుడు అడ్డుకున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హామిల్టన్ వేదికగా రెండో వన్డేలో టాస్ ఓడిన టీమ్ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, శిఖర్ ధవన్ జట్టుకు మరోసారి శుభారంభాన్ని ఇచ్చారు. గిల్ 21 బాల్స్లో 19 రన్స్ చేయగా, ధవన్ 8 బంతుల్లో 2 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ 4.5 ఓవర్లో ఆటకు వర్షం అడ్డుపడింది. దీంతో ఫీల్డ్ అంపర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు.
మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఇప్పటికే 1-0తో వెనుకబడింది. దీంతో సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్లో శిఖర్ సేన తప్పక గెలవాల్సిందే. అయితే టీమ్ఇండియా బ్యాట్స్మెన్ బాగానే స్కోర్ చేస్తున్నప్పటికీ, బౌలర్లు అంతగా రాణించలేకపోతున్నారు. మొదటి వన్డేలో 300 పరుగులకుపైగా టార్గెట్ను కివీస్ ముందు ఉంచినప్పటికీ.. బౌలర్ల వైఫల్యంతో జట్టు ఓటమిచెందక తప్పలేదు.
#INDvsNZ | 2nd ODI match between India & New Zealand has been interrupted because of rain in Hamilton.
— ANI (@ANI) November 27, 2022