ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల సహనానికి వరుణ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప్రారంభం అవడమే తరువాయి అని అంతా అనుకున్నారు.
అలాంటి సమయంలో మరోసారి వర్షం ప్రారంభమైంది. దీంతో చిరాకు పడిపోతున్న క్రికెట్ అభిమానులు అసలు క్రికెట్ ఆడేందుకు ఐర్లాండ్ వాతావరణం పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వర్షం మరింత పెద్దది అవుతుండటం వారికి మరింత చికాకు కలిగిస్తోంది.
కాగా, ఈ మ్యాచ్ ఆడే 11 మంది ఆటగాళ్లలో సంజూ శాంసన్ పేరు లేకపోవడంపై కూడా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంజూను పక్కనపెట్టి దీపక్ హుడాను తీసుకోవడం ఏంటని ప్రవ్నిస్తున్నారు.