ఆసియా కప్ను భారత జట్టు విజయంతో ఆరంభించింది. పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో అద్భుత విజయం సాధించింది. తన మరుసటి పోరులో హాంగ్ కాంగ్ను ఎదుర్కోనుంది. హాంగ్ కాంగ్ పసికూన కాబట్టి భారత్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అనుకుంటే పొరబడినట్లేనని మాజీ లెజెండ్ వసీం జాఫర్ అన్నాడు. 2018 ఆసియా కప్లో భారత్ను హాంగ్ కాంగ్ ఓడించినంత పని చేసిందని గుర్తుచేశాడు. ఆ మ్యాచ్లో శిఖర్ ధావన్ (127) రాణించడంతో భారత్ 286 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో హాంగ్ కాంగ్ తొలి వికెట్కు 174 పరుగులు జోడించి దాదాపు గెలిచినంత పని చేసింది. చివరకు 26 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇదే విషయాన్ని గుర్తుచేసిన జాఫర్.. పాకిస్తాన్ మ్యాచ్తో పోల్చుకుంటే ఇది కొంత ఈజీగా ఉండొచ్చని, కానీ భారత జట్టు ప్రత్యర్థిని ఈజీగా తీసుకోకూడదని సూచించాడు. టీ20 క్రికెట్లో మ్యాచ్ చేజారడానికి ఎంతో సమయం పట్టదని, అందుకే ఈ మ్యాచ్ను భారత్ సులభంగా తీసుకుంటుందని తాను అనుకోవడం లేదన్నాడు. అంతకుముందు మ్యాచ్ గెలిచారు కాబట్టి, ఈ విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని అనుకుంటారని వివరించాడు.