ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. ఆరంభంలోనే గిల్ (17) అవుటయ్యాడు. అతనితోపాటు ఓపెనర్గా వచ్చిన ఛటేశ్వర్ పుజారా (13) మరోసారి నిరాశ పరిచాడు. ఇలాంటి క్రమంలో క్రీజులో నిలదొక్కుకుంటాడని అనుకున్న విహారి (20)ని పాట్స్ పెవిలియన్ చేర్చాడు.
పాట్స్ వేసిన ఇన్స్వింగర్ను విహారి అంచనా వేయలేకపోయాడు. దీంతో అతను ఎల్బీగా పెవిలియన్ చేరాడు. భారత జట్టు 64 పరుగులకు మూడు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది.