IND vs ENG: ఇంగ్లండ్తో మ్యాచ్లో భారత బ్యాటర్ల ఆట అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ పేలవంగా సాగుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ తొలుత తడబడ్డా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ నిలబడటంతో కాస్త మెరుగుపడ్డ భారత స్కోరుబోర్డు మళ్లీ గాడితప్పదింది. కెఎల్ రాహుల్ (58 బంతుల్లో 38, 3 ఫోర్లు) తో పాటు రోహిత్ శర్మ (101 బంతుల్లో 87, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకున్నా వాళ్లు కూడా కీలక సమయంలో నిష్క్రమించడంతో భారత్ ఓ మోస్తారు లక్ష్యాన్నైనా ఇంగ్లండ్ ముందు ఉంచుతుందా..? అన్నది అనుమానంగా మారింది.
40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ను రాహుల్ – రోహిత్ల జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 91 పరుగులు జోడించారు. కానీ రాహుల్ను డేవిడ్ విల్లే.. 30వ ఓవర్లో ఔట్ చేయగా సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్ను అదిల్ రషీద్ 36.5వ ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. ఫలితంగా భారత్.. 40 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (8) కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ (31 నాటౌట్), కుల్దీప్ యాదవ్ లు క్రీజులో ఉన్నారు. సూర్యకుమార్ ధాటిగా ఆడితేనే భారత్ పోరాడే స్కోరును ఇంగ్లండ్ ముందు ఉంచే అవకాశం ఉంటుంది.