భారత్తో ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత టీ20, వన్డే మ్యాచ్లు ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్తో ఆడే పరిమిత ఓవర్ల సిరీస్కు రెండు జట్లను ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవలే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధి ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఆ బాధ్యతలను సూపర్ ఫామ్లో ఉన్న జోస్ బట్లర్కు ఈసీబీ అప్పగించిన సంగతి తెలిసిందే.
టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఏడో తేదీన భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 జరుగుతుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత 12వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. ఆ జట్టు స్లార్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఈ రెండు సిరీస్లకు దూరమయ్యాడు. కుటుంబంతో కలిసి అతను హజ్ యాత్రకు వెళ్లేందుకు ఈసీబీ అనుమతించింది. దీంతో అతను ఈ సిరీస్ ఆడటం లేదని తెలిపింది.
ఇంగ్లండ్ టీ20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయీన్ అలీ, హ్యారీ బ్రూక్, శామ్ కర్రాన్, రిచర్డ్ గ్లీసన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టన్, డేవిడ్ మలాన్, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ
ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయీన్ అలీ, జొనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, శామ్ కర్రాన్, లియామ్ లివింగ్స్టన్, క్రెగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, జో రూట్, జేసన్ రాయ్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లీ
Our squad to take on @BCCI in the three-match IT20 series 💥
More here: https://t.co/UumWQ5m7xa
🏴 #ENGvIND 🇮🇳 @Vitality_UK pic.twitter.com/ZNqEtmHNZC
— England Cricket (@englandcricket) July 1, 2022
Our squad for the three-match ODI series with @BCCI! 🧢
More here: https://t.co/oLGb3baHyu
🏴 #ENGvIND 🇮🇳 @RoyalLondon pic.twitter.com/SpVsDND6QO
— England Cricket (@englandcricket) July 1, 2022
Hajj Mubarak, Rash ❤️
We all wish Adil well as he makes The Hajj pilgrimage to Mecca. pic.twitter.com/kboYI68qlg
— England Cricket (@englandcricket) July 1, 2022