IND vs ENG 3rd Test | రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్ క్రికెట్కు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. బజ్బాల్ ఆటతో టెస్టు క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఇంగ్లండ్.. భారత్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో 557 పరుగుల టార్గెట్ను ఛేదించాల్సి ఉంది. ఇంగ్లండ్కు ఇది శక్తికి మించిన పనే. అయినా ఆశావాహ దృక్ఫథంతో ఆడుతున్న ఇంగ్లండ్.. రాజ్కోట్ టెస్టులో ఏం మాయ చేస్తుందనో అని ఆ జట్టు అభిమానులు వేచి చూస్తున్నారు. కానీ గణాంకాలు చూస్తే మాత్రం.. మూడో ఇన్నింగ్స్లో ఆ జట్టు ప్రత్యర్థి జట్లకు 400 ప్లస్ టార్గెట్ ఇచ్చి గెలిచిన సందర్భాలు చరిత్రలో లేవు.
ఇప్పటివరకూ టెస్టు క్రికెట్లో ఆ జట్టు అత్యధిక ఛేదన 378 పరుగులు. 2022లో ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరిగిన టెస్టులో బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలోని ఇంగ్లండ్.. ఆ టార్గెట్ను అవలీలగా ఛేదించింది. ఆసియాలో ఆ జట్టు హయ్యస్ట్ సక్సెస్ఫుల్ ఛేజ్ 209 పరగులు మాత్రమే. 1961లో లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్.. 209 పరుగుల ఛేదనను విజయవంతంగా పూర్తిచేసింది. భారత్లో ఆ జట్టు నాలుగో ఇన్నింగ్స్లో బెస్ట్ ఛేజింగ్ 208. వైజాగ్ టెస్టులో భాగంగా 399 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్.. 292 పరుగుల వద్దే ఆగిపోయింది.
ఇంగ్లండ్ 22 సార్లు..
టెస్టులలో ఇంగ్లండ్ జట్టు నాలుగో ఇన్నింగ్స్లో ప్రత్యర్థి జట్లకు 500 ప్లస్ లీడ్ సమర్పించుకోవడం ఇది 25వ సారి. ఈ 25లలో ఇంగ్లండ్ 22 సార్లు ఓడిపోయింది. రెండుసార్లు డ్రా చేసుకుంది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు.
టెస్టులలో అత్యధిక ఛేదన..
టెస్టులలో ఇప్పటివరకూ అత్యధిక ఛేదన 418 పరుగులు. 2003లో వెస్టిండీస్.. ఆస్ట్రేలియా నిర్దేశించిన 418 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. టెస్టులలో 400 ప్లస్ టార్గెట్లు ఛేదించిన సందర్భాలు నాలుగు మాత్రమే. అందులో వెస్టిండీస్, సౌతాఫ్రికా (414.. ఆసీస్పై), ఆస్ట్రేలియా (404, ఇంగ్లండ్పై), ఇండియా (403, విండీస్పై) లు మాత్రమే ఉన్నాయి.