IND vs ENG 2nd Test: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా నేటి నుంచి మొదలైన రెండో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. జైస్వాల్ శతకం బాదాడు. 151 బంతుల్లో సెంచరీ చేసిన జైస్వాల్కు స్వదేశంలో ఇదే మొదటి (టెస్టులలో) మూడంకెల స్కోరు. ఈ హండ్రెండ్ ద్వారా జైస్వాల్ దిగ్గజాల సరసన చేరాడు. 23 ఏండ్ల లోపే స్వదేశంతో పాటు విదేశాల్లో సెంచరీలు చేసిన దిగ్గజ బ్యాటర్ల సరసన చేరాడు.
గతేడాది వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో ఎంట్రీ ఇచ్చి ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే భారీ శతకం (171) బాదిన జైస్వాల్.. తాజాగా విశాఖపట్నంలోనూ సెంచరీ చేశాడు. తద్వారా 23 ఏండ్లకే స్వదేశంతో పాటు విదేశాల్లోనూ శతకాలు చేసిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజాలు రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు జైస్వాల్ కంటే ముందున్నారు. యాధృశ్చికంగా ఈ నలుగురూ ముంబై రంజీ జట్టుకు చెందినవాళ్లే కావడం గమనార్హం.
That moment when @ybj_19 got to his second Test 💯
Watch 👇👇#INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/Er7QFxmu4s
— BCCI (@BCCI) February 2, 2024
ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా హైదరాబాద్లో ముగిసిన తొలి టెస్టులోనే జైస్వాల్ సెంచరీకి చేరువగా వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి 80 పరుగులు చేసిన జైస్వాల్.. జో రూట్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్లో అతడు 15 పరుగులే చేశాడు. కానీ విశాఖ టెస్టులో మాత్రం సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకోలేదు. ఆది నుంచి ఆచితూచి ఆడిన జైస్వాల్.. 94 పరుగుల వద్ద ఉండగా సిక్సర్ బాది శతకాన్ని పూర్తిచేసుకోవడం విశేషం.
విశాఖ టెస్టులో టీ విరామానికి మూడు వికెట్లు నష్టపోయి 225 పరుగులు చేసిన భారత్.. ఆ తర్వాత నిలకడగా ఆడుతోంది. 70 ఓవర్లు ముగిసేసరికి భారత్.. 3 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (141 నాటౌట్), రజత్ పాటిదార్ (32 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.