IND vs ENG 2nd Test: స్వదేశంలో ఆడే టెస్టు సిరీస్లలో ఎక్కువగా టర్నింగ్ ట్రాక్ (స్పిన్ పిచ్లు)లను ఉపయోగించే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇకనైనా ఆ ఆలోచన మానుకోవాలని సూచిస్తున్నాడు మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. భారత్కు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్ వంటి నాణ్యమైన పేసర్లను జట్టులో పెట్టుకుని భారత్ ఇంకా సంప్రదాయక స్పిన్ పిచ్లను తయారుచేయడం దేనకని నిలదీస్తున్నాడు. భారత్ – ఇంగ్లండ్ మధ్య వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీయడంలో విఫలమైన చోట బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగిన నేపథ్యంలో దాదా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
దాదా స్పందిస్తూ… ‘బుమ్రా, షమీ, సిరాజ్, ముఖేశ్ వంటి బౌలర్లు తమ బౌలింగ్తో అద్భుతంగా రాణిస్తున్నప్పుడు భారత్ ఇంకా టర్నింగ్ పిచ్లను తయారుచేయాల్సిన అవసరం ఏముంది..? ఒక జట్టు మంచి వికెట్ల (పిచ్) మీద ఆడినప్పుడే రాటుదేలుతుంది. మనకున్న పేసర్లు.. అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ల సాయంతో టెస్టులో 20 వికెట్లు పడగొట్టగల సమర్థులే…’అని దాదా ట్వీట్లో పేర్కొన్నాడు.
When I see Bumrah Sami Siraj Mukesh bowl . I wonder why do we need to prepare turning tracks in india ..my conviction of playing on good wickets keeps getting stronger every game .. They will get 20 wickets on any surface with ashwin jadeja Kuldeep and axar .. batting quality…
— Sourav Ganguly (@SGanguly99) February 3, 2024
దాదా గతేడాది బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ సందర్భంగా కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేయడం గమనార్హం. భారత్ స్పిన్ పిచ్లపై అతిగా ఆధారపడాల్సిన అవసరం లేదని, మన పేసర్లు స్వదేశంలో రాణించగలరన్న విశ్వాసాన్ని దాదా వ్యక్తం చేశాడు. స్పిన్ ట్రాక్ల వల్ల గడిచిన ఆరేడేండ్లుగా భారత బ్యాటింగ్లో క్వాలిటీ కరువైందని, మెరుగైన వికెట్ల ఆవశ్యకత తప్పకఉందని దాదా తెలిపాడు. స్వదేశంలో ఐదు రోజుల మ్యాచ్లు ఆడి భారత్ విజయాలు సాధించగలదన్న విశ్వాసం తనకు ఉందని తాజా ట్వీట్లో పేర్కొన్నాడు.
THE DESTROYER OF ENGLAND – BUMRAH 🔥🤯pic.twitter.com/oeSPodRyax
— Johns. (@CricCrazyJohns) February 3, 2024