IND vs ENG 2nd Test: ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా భారత జట్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ఆడనుంది. టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్తో పాటు స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు రెండో టెస్టు నుంచి తప్పుకున్న నేపథ్యంలో సెలక్టర్లు దేశవాళీలో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్లను జట్టులోకి ఎంపికచేసిన విషయం తెలిసిందే. ఇంతవరకూ భారత్ తరఫున ఒక్క టెస్టూ కూడా ఆడని ఈ ఇద్దరిలో ఎవరు తుది జట్టులో ఉండనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉండటంతో ఆ అదృష్టవంతుడు ఎవరవుతారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
దేశవాళీ క్రికెట్లో ఈ ఇద్దరూ పరుగుల వరద పారిస్తున్నవారే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 45 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్.. ఏకంగా 70.48 సగటుతో 3,912 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 14 శతకాలు, 11 అర్థ శతకాలున్నాయి. పాటిదార్ విషయానికొస్తే.. 55 మ్యాచ్లు ఆడిన పాటిదార్, 53.48 సగటుతో 4 వేల పరుగులు చేశాడు. పాటిదార్ ఖాతాలో 12 శతకాలు 22 అర్థ శతకాలున్నాయి. దేశవాళీతో పాటు ఇండియా ‘ఎ’ తరఫునా ఈ ఇద్దరూ అదరగొడుతున్నారు.
Sarfaraz Khan in his first training session with Indian team. 🇮🇳 pic.twitter.com/vfHzYPhQfH
— Johns. (@CricCrazyJohns) January 31, 2024
ఈ ఇద్దరు యువ బ్యాటర్లలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కనుందన్న విషయమై తాజాగా భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా కఠినమైన ఎంపిక. ఆ ఇద్దరూ సూపర్ ప్లేయర్స్. దేశవాళీ క్రికెట్లో వాళ్లు ఎలా ఆడుతున్నారనేది మేం గమనిస్తూనే ఉన్నాం. స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్లు గనక ఇక్కడి పిచ్లపై పూర్తి అవగాహన ఉన్న క్రికెటర్లు జట్టులోకి వస్తే అది టీమ్కూ మంచిది. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికే తుది జట్టులో చోటు దక్కుతుంది. ఒకరిని ఎంపిక చేసుకుని మరొకరిని బెంచ్కే పరిమితం చేయడం చాలా కష్టంతో కూడుకున్నదే. కానీ ఈ విషయంలో రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్లదే తుది నిర్ణయం. మ్యాచ్కు ముందు రోజే తుది జట్టులో ఎవరుంటారనేదానిపై క్లారిటీ వస్తుంది…’ అని తెలిపాడు.