IND vs ENG 2nd Test: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ వాగ్వాదానికి దిగాడు. మైండ్గేమ్ ఆడటంలో దిట్ట అయిన ఇంగ్లండ్ ఆటగాళ్లు మరోసారి అదే రిపీట్ చేసి పలితాన్ని రాబట్టారు. ఉత్తపుణ్యానికే అశ్విన్తో గొడవపడి అతడి ఏకాగ్రతను దెబ్బతీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకెళ్తే.. రెండో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్లో అండర్సన్ వేసిన ఓవర్లో జైస్వాల్ క్రీజులో ఉండగా అశ్విన్ నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్నాడు. అండర్సన్ బౌలింగ్ వేసే సమయంలోనే అశ్విన్ తన చేతిని ముందుకుచాచాడు. అయితే ఇదేమీ అశ్విన్.. అండర్సన్ను రెచ్చగొట్టాలని ఉద్దేశపూర్వకంగా చేసిందైతే కాదు. తన టీషర్ట్ను భుజం పైకి జరుపుకునే ప్రక్రియలో అశ్విన్ అలా చేశాడు. కానీ అదే సయమంలో రనప్లో ఉన్న అండర్సన్.. అశ్విన్ను చూసి అంపైర్ను దాటగానే బంతిని వేయకుండా రిటర్న్ అయ్యాడు.
— Nihari Korma (@NihariVsKorma) February 3, 2024
అండర్సన్ రిటర్న్ వెళ్తూ వెళ్తూ కోపంగా అశ్విన్ వైపునకు చూసి ‘ఎందుకలా చేశావ్..? ’ అన్నట్టుగా అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లాడు. అశ్విన్ కూడా తానేమీ చేయలేదని చెప్పినా వినకుండా ఏదో గునుక్కుంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బంతి వేసిన అండర్సన్.. అంపైర్ దగ్గర క్యాప్ తీసుకుంటూ అశ్విన్ తన ఏకాగ్రతను దెబ్బతీశాడని చెబుతూ వివరించాడు. అశ్విన్ను రెచ్చగొట్టిన అండర్సన్ వేసిన వందో ఓవర్లో అతడిని ఔట్ చేయడం గమనార్హం. 37 బంతులాడిన అశ్విన్.. 4 బౌండరీల సాయంతో 20 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 112 ఓవర్లు ఆడి 396 పరుగుల స్కోరు చేసింది.