IND vs ENG 1st Test: ఇంగ్లండ్తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్లో 436 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లోనూ బంతితో అదరగొడుతోంది. సెకండ్ ఇన్నింగ్స్లో టీ విరామ సమయానికి ఇంగ్లండ్.. 42 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓలీ పోప్ (94 బంతుల్లో 67 బ్యాటింగ్, 7 ఫోర్లు) తో పాటు వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (2 బ్యాటింగ్) లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోరు కంటే ఇంగ్లండ్ ఇంకా 18 పరుగులు వెనుకబడి ఉంది.
రెండో ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ ధాటిగా ఆరంభించినా తర్వాత వరుసగా షాకులతో కుదేలైంది. జాక్ క్రాలే (31), బెన్ డకెట్ (47)లు దూకుడుగా ఆడారు. కానీ డకెట్ను బుమ్రా బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రాలేను అశ్విన్ ఔట్ చేశాడు. క్రాలే స్థానంలో వచ్చిన రూట్ (2) కూడా విఫలమయ్యాడు. రూట్ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రూట్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ స్టో (10)ను రవీంద్ర జడేజా అద్భుతమైన డెలివరీతో బౌల్డ్ చేశాడు.
📽️ R Ashwin to Ben Stokes
What a delivery 🙌#TeamIndia | #INDvENG | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/sxBGnhmhl0
— BCCI (@BCCI) January 27, 2024
ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ (6)కు అశ్విన్ భారీ షాకిచ్చాడు. 33 బంతులు ఆడి 6 పరుగులు చేసిన స్టోక్స్.. టీ విరామానికి నాలుగు ఓవర్ల ముందు అశ్విన్ వేసిన ఓవర్లో ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్టోక్స్ను బౌల్డ్ చేయడం అశ్విన్కు ఇది టెస్టులలో 12వ సారి కావడం గమనార్హం. సహచర ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నా పోప్ మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. టెస్టులలో 12వ అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న పోప్ మీదే ఇంగ్లండ్ ఆశలన్నీ. మరోవైపు ఇవ్వాళే ఇంగ్లండ్ను ఆలౌట్ చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతున్నది.