IND vs ENG 1st Test: భారత్ – ఇంగ్లండ్ మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 246 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ జోరు చూపిస్తున్నది. రెండో రోజు టీ విరామానికి భారత్.. 5 వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (68 బంతుల్లో 45 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు కోన శ్రీకర్ భరత్ (37 బంతుల్లో 9 నాటౌట్)లు ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిక్యం 63 పరుగులుగా ఉంది.
రెండో రోజు 119-1 వద్ద ఆట ఆరంభించిన భారత్ లంచ్ సమయానికి 50 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. లంచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ (35) వికెట్ కోల్పోయిన రోహిత్ సేన.. ఇంగ్లండ్ స్కోరును దాటేయడంతో పాటు ఆధిక్యాన్ని దక్కించుకుని ముందుకు సాగుతున్నది. అర్థ సెంచరీ తర్వాత కెఎల్ రాహుల్ (86).. 14 పరుగుల తేడాతో టెస్టులలో 9వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
It’s Tea on Day 2 of the opening #INDvENG Test! #TeamIndia added 87 runs in the Second Session to move to 309/5.
Stay Tuned for the Third Session ⌛️
Scorecard ▶️ https://t.co/HGTxXf7Dc6@IDFCFIRSTBank pic.twitter.com/XzC1heCbcN
— BCCI (@BCCI) January 26, 2024
రాహుల్ నిష్క్రమించినా జడ్డూ భారత స్కోరుబోర్డును నడిపిస్తున్నాడు. అయ్యర్ ఔట్ కాగానే చుట్టూ ఫీల్డర్లతో జడేజాపై ఒత్తిడి తెచ్చేందుకు స్టోక్స్ యత్నించాడు. కానీ రెండు భారీ సిక్సర్లతో పాటు బౌండరీలు బాదిన జడ్డూ.. అర్థ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రెండో సెషన్లో భారత్.. 26 ఓవర్లు ఆడి 87 పరుగులు చేసి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఒక్క సెషన్ మాత్రమే మిగిలున్న ఈరోజు పూర్తిగా ఆడితే భారత్ ఈ మ్యాచ్పై పూర్తి పట్టు సాధించే అవకాశాలుంటాయి. ప్రస్తుతం క్రీజులో ఉన్న జడ్డూ, భరత్తో పాటు అశ్విన్, అక్షర్ కూడా బ్యాటింగ్ చేయగల సమర్థులు. మరి లోయరార్డర్ బ్యాటర్లు భారత్కు ఎంత ఆధిక్యాన్ని ఇవ్వగలరనేది ఆసక్తికరంగా మారింది.