ఢాకా: బంగ్లాదేశ్తో రెండో వన్డేలో 272 పరుగుల చేధనే లక్ష్యంగా బరిలో దిగిన భారత్.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 7 పరుగులు ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ (5) ఎబాదత్ హుస్సేన్ బౌలింగ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో మెహదీ హసన్కు క్యాచ్ ఇచ్చి శిఖర్ ధవన్ (8) పెవిలియన్ ముఖం పట్టాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ (11).. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
19వ ఓవర్లో కేఎల్ రాహుల్ (14).. మెహదీ హసన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ శ్రేయాస్ అయ్యర్కు తోడుగా క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ.. చెత్త బంతులను మాత్రమే బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును కదిలించారు. ఈ క్రమంలో అయ్యర్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దాంతో టీమ్ స్కోర్ 117/4 కు చేరింది.
కాగా, మూడు వన్డేల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్లోని షేర్ ఏ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ రెండో వన్డే జరుగుతున్నది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది.