IND vs AUS : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు వేదిక మారనుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 1న ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఈమధ్యే గ్రౌండ్కు మరమ్మతులు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించేందుకు స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. దాంతో, మరో గ్రౌండ్లో మూడో టెస్టు జరగనుంది. ఇండోర్ లేదా రాజ్కోట్లో మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
భారత్లోని ఎత్తైన స్టేడియంగా గుర్తంపు తెచ్చుకున్నధర్మశాలలో ఇప్పటివరకూ ఒకే ఒక టెస్టు జరిగింది. అది కూడా 2017లో. ఈ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియాను ఓడించి 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ స్టేడియంలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగిందో తెలుసా..? 2022 ఫిబ్రవరిలో. ఈ స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక రెండు టీ20 మ్యాచ్లు ఆడాయి.
నాగ్పూర్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 రన్స్తో ఆసీస్ను చిత్తు చేసింది. రవీంద్ర జడేజా 7 వికెట్లు, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లతో చెలరేగారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 177, రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు ఢిల్లీలో ఫిబ్రవరి 17న మొదులు కానుంది.