ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు పటిష్టస్థితిలో నిలిచింది. ఆరంభంలోనే భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (2) పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (47 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (23 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడారు. దీంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 86/2 స్కోరుతో నిలిచింది. ఆసీస్ బౌలర్లలో స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్, నాథన్ ఎల్లీస్ చెరో వికెట్ తీసుకున్నారు.
50-run partnership comes up between @klrahul & @surya_14kumar 🙌🙌
After 10 overs #TeamIndia are 86/2
Live – https://t.co/TTjqe4nsgt #INDvAUS @mastercardindia pic.twitter.com/bAkwa6YcrU
— BCCI (@BCCI) September 20, 2022