ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా జట్టు ఉప్పల్ స్టేడియం చేరుకుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. తొలి రెండు మ్యాచుల్లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ స్టేడియంలో జరగబోయే మూడో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇది. చివరగా 2019లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా స్టేడియం చేరుకున్నారు.
Nagpur ✅
Hello Hyderabad! 👋#TeamIndia | #INDvAUS pic.twitter.com/gIey9Ncqm8
— BCCI (@BCCI) September 25, 2022