IND vs AUS | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ( Border Gavaskar Trophy )లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన టీమిండియా.. మూడో టెస్టులో తడబడింది. ఇండోర్ వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే ఆలౌటైంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా మూడో టెస్టులో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. పరుగులు చేయడంలో టీమిండియా ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి క్రీజుకు చేరారు. విరాట్ కోహ్లీ (22), శుభ్మన్ గిల్ (21), ఉమేశ్ యాదవ్ (17 ) శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12), రోహిత్ శర్మ (12) దారుణంగా విఫలమయ్యారు. మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఫలితంగా 109 పరుగులకే టీమిండియా ఆలౌటైంది.