ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17) ఇద్దరూ విఫలమయ్యారు. ముఖ్యంగా రాహుల్ తొలి ఓవర్లోనే అవుటవడంతో రోహిత్పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే భారీ షాట్ ఆడే యత్నంలో అతను అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ (22 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (4 నాటౌట్) ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో తొలి పవర్ప్లే ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.