ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. ప్యాట్ కమిన్స్ వేసిన 4వ ఓవర్ తొలి బంతికి బౌండరీ కొట్టిన రోహిత్.. ఆ తర్వాతి రెండు బంతులకు పరుగులు చేయలేదు. దీంతో నాలుగో బంతికి మరో భారీ షాట్ ఆడేందుకు ముందుకొచ్చిన అతను.. కమిన్స్ షార్ట్ బాల్ వేయడంతో తనకు ఇష్టమైన పుల్ షాట్ ఆడాడు.
అయితే అప్పటికే అతను ముందుకు వచ్చేసి ఉండటంతో బంతి సరిగా కనెక్ట కాలేదు. దీంతో స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న డానియల్ శామ్స్కు సులభమైన క్యాచ్ దక్కింది. భారత జట్టు 30 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.