భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. నిదానంగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న గ్లెన్ మ్యాక్స్వెల్ (6) అవుటయ్యాడు. చాహల్ వేసిన 8వ ఓవర్లో బంతిని పుష్ చేసిన స్మిత్ సింగిల్ కోసం పరుగు తీశాడు. అయితే ఆ బంతి అందుకున్న అక్షర్ పటేల్ త్రో విసిరాడు.
దాన్ని పూర్తిగా అందుకోకముందే డీకే గ్లౌవ్స్ వికెట్లను తాకాయి. దీంతో మ్యాక్స్వెల్ అవుటయ్యాడా? లేదా? అని సందేహాలు తలెత్తాయి. అయితే డీకే గ్లౌవ్స్ తాకి ఒక బెయిల్ మాత్రమే కదలగా.. అక్షర్ వేసిన త్రో అవతలి వైపు ఉన్న వికెట్ను కూల్చింది. దీంతో మ్యాక్స్వెల్ పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు 76/3 స్కోరుతో నిలిచింది.