అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను అంతా ఉత్కంఠతో చూస్తున్నారు. (IND Vs AUS) ఇప్పటి వరకు వరుస విజయాలు సొంతం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్లో కూడా గెలిచి వరల్డ్ కప్ సాధించాలని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే టీమిండియా గెలుపు కోసం పలు ప్రాంతాల్లో పూజలు, యాగాలు కూడా నిర్వహించారు.
కాగా, క్రికెట్ వరల్డ్ కప్ విజేతను ఒక పిల్లి అంచనా వేసింది. ఏ టీం గెలుస్తుందో అన్నది జోస్యం చెప్పింది. పిల్లి యజమాని తన రెండు అర చేతులపై భారత్, ఆస్ట్రేలియా పేర్లు రాశాడు. పిడికిలి మూసిన తన రెండు చేతులను పిల్లి ముందు ఉంచాడు. అయితే భారత్ అని రాసి ఉన్న చేతిని పిల్లి తాకింది. ఈ నేపథ్యంలో క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అన్నది స్పష్టమైందని ఆ పిల్లి యాజమాని పేర్కొన్నాడు.
మరోవైపు స్విగ్గీ ఎక్స్లో షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు దీనిని లైక్ చేశారు. అలాగే ఆస్ట్రేలియాపై టీం ఇండియా విజయం సాధించి వరల్డ్ కప్ దక్కించుకోవాలని ఆకాంక్షించారు.
asked my cat who’s going to win today 😼 guess we have a clear answer 😽 #INDvAUS #WorldCupFinal pic.twitter.com/XHwo8PEHZj
— Swiggy (@Swiggy) November 19, 2023
उप्र कांग्रेस अध्यक्ष अजय राय ने विश्व कप फाइनल में टीम इंडिया की जीत के लिए हवन किया।
#INDvsAUS #WorldcupFinal pic.twitter.com/Hid6Ee7y90
— Satyam Patel | 𝕏… (@SatyamInsights) November 18, 2023
#WATCH | Maharashtra: People perform special Aarti at Shree Siddhivinayak temple in Pune and cheer for team India's victory in the ICC World Cup final match against Australia. pic.twitter.com/PhLsrZr9Mi
— ANI (@ANI) November 19, 2023