ఆసీస్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ సత్తా చాటుతున్నాడు. మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే తను మాత్రం పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 15 ఓవర్లో బంతి అందుకున్న అతను తొలి బంతికే జోష్ ఇంగ్లిస్ (17) పెవిలియన్ చేర్చాడు.
అక్షర్ వేసిన బంతిని ఫైన్లెగ్ వైపు స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన ఇంగ్లిస్.. లెగ్ వికెట్ను ఎక్స్పోజ్ చేశాడు. అదే సమయంలో స్పిన్ అయిన బంతి.. నేరుగా వెళ్లి ఆ వికెట్ను కూల్చింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులతో నిలిచింది.