మెల్బోర్న్: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 24 నుంచి టీమ్ఇండియాతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టును ప్రకటించింది. 18 మందితో కూడిన ఈ బృందంలో స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, మిషెల్ స్టార్క్ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం కంగారూ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. అక్కడి నుంచి నేరుగా భారత్లో అడుగు పెట్టనుంది.
వేర్వేరు కారణాల వల్ల సఫారీ టూర్కు దూరమైన ఈ ముగ్గురు ప్లేయర్ల రాకతో ఆసీస్ బలం మరింత పెరగనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ నెల 24న మొహాలీలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుండగా.. ఆ తర్వాత వరుసగా సెప్టెంబర్ 28 (ఇండోర్), అక్టోబర్ (1) రాజ్కోట్లో మ్యాచ్లు ఆడనుంది. ఇక వచ్చే నెల 5 నుంచి వరల్డ్కప్ ప్రారంభం కానుండగా.. అందులో భాగంగా భారత్ తొలి మ్యాచ్లో 8వ తేదీన చెన్నై వేదికగా ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది.
భారత్తో సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు
కమిన్స్ (కెప్టెన్), అబాట్, కారీ, ఎలీస్, కామెరూన్ గ్రీన్, హజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, లబుషేన్, మిషెల్ మార్ష్, మ్యాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, స్మిత్, స్టార్క్, స్టొయినిస్, వార్నర్, జాంపా.