Women IPL | ఇప్పటి వరకు పురుషుల టీ-20 టోర్నీ `ఐపీఎల్`తో అలరించిన ఇండియన్ క్రికెట్ అభిమానుల కోసం మహిళా టీ-20 టోర్నీ.. `మహిళా ఐపీఎల్` రాబోతున్నది. ఐదు టీమ్లతో టోర్నీ వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నది. నెల రోజుల పాటు సాగే ఈ క్రీడా సంరంభం క్రికెట్ ఫ్యాన్స్కు కనువిందు చేయనున్నదని బీసీసీఐ సీనియర్ అధికారి శుక్రవారం ధృవీకరించారు. దీని ప్రకారం పురుషుల ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందే తొలి డబ్ల్యూఐపీఎల్ నిర్వహిస్తారని తెలుస్తున్నది. దక్షిణాఫ్రికాలో ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ తర్వాత మార్చిలో డబ్ల్యూఐపీఎల్ నిర్వహించడానికి గల అవకాశాలపై బీసీసీఐ పెద్దలు చర్చించినట్లు సమాచారం.
`అవును, డబ్ల్యూఐపీఎల్ మార్చి మొదటి వారంలో మొదలవుతుంది. తొలి సీజన్లో నాలుగు వారాలు టోర్నీ సాగుతుంది. అంతకుముందు దక్షిణాఫ్రికాలో ఫిబ్రవరి 9-26 మధ్య టీ-20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ వెంటనే డబ్ల్యూఐపీఎల్ నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నాం` అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
`ఇన్వెస్టర్ల ఆసక్తిని బట్టి ఐదు లేదా ఆరు టీమ్లు టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంది. డబ్ల్యూఐపీఎల్ టీమ్ల కోసం వేలం ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుంది` అని ఆ బీసీసీఐ అధికారి చెప్పారు. 2023లో మహిళా ఐపీఎల్ టోర్నీ ప్రారంభం అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జయ్షా వేర్వేరుగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు.