గోల్డ్కోస్ట్: కష్టతరమైన లక్ష్యఛేదనలో బ్యాటర్లు తడబడటంతో ఆస్ట్రేలియాతో మూడో టీ20లోనూ భారత మహిళల జట్టుకు పరాజయం తప్పలేదు. ఆదివారం ఇక్కడ జరిగిన ఆఖరి పోరులో భారత్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఆసీస్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసింది. బెత్ మూనీ (61; 10 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. తహిలా మెక్గ్రాత్ (44 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో రాజేశ్వరి రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేజింగ్లో హర్మన్ప్రీత్ బృందం 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (52; 8 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నా.. మిగిలినవాళ్లు విఫలమవడంతో భారత్ పరాజయం పాలైంది.