Bangladesh | సిల్హెట్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 165-5 స్కోరు చేసింది. కమిందు మెండిస్(37), కుశాల్ మెండిస్(36), మాథ్యూస్(32 నాటౌట్) రాణించారు.
తస్కిన్ అహ్మద్, మెహదీహసన్, ముస్తాఫిజుర్, సౌమ్య సర్కార్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా..18.1 ఓవర్లలో 170-2 స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్(53 నాటౌట్), లిటన్దాస్(36)విజృంభించారు. పతిరణ రెండు వికెట్లు తీశాడు. నజ్ముల్ హుస్సేన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.