కురవి: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. వాలీబాల్ అండర్-19 విభాగం ఫైనల్లో ఇందల్వాయి 15-6, 15-3తో కురవిపై విజయం సాధించింది. తొలి నుంచే దూకుడు ప్రదర్శించిన ఇందల్వాయి జట్టు వరుస గేముల్లో మ్యాచ్ను ముగించి విజేతగా నిలిచింది. హ్యాండ్బాల్ అండర్-19 బాలికల విభాగం ఫైనల్లో ఎల్లారెడ్డిపేట జట్టు 16-8తో కురవిపై గెలిచింది. బాస్కెట్బాల్ అండర్-19 బాలుర విభాగంలో గాంధారిపై బాలానగర్ విజయం సాధించగా, బ్యాడ్మింటన్ బాలుర డబుల్స్లో కొత్తగూడెం గెలిచింది.