పారిస్: అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) బార్సిలోనాతో తన రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని కొత్త క్లబ్తో చేరాడు. బుధవారం అతడు పారిస్ సెయింట్-జెర్మెయిన్ (పీఎస్జీ)తో రెండేళ్లకుగాను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ.. మరో చాంపియన్స్ లీగ్ గెలవడం నా కల. ఆ పని చేయడానికి నేను సరైన ప్లేస్లోనే ఉన్నానని అనుకుంటున్నాను అని మెస్సీ అన్నాడు. చివరిసారి 2015లో బార్సిలోనా టీమ్లో తన చివరి యురోపియన్ టైటిల్ను మెస్సీ గెలిచాడు.
అయితే పీఎస్జీ మాత్రం ఇప్పటి వరకూ చాంపియన్స్ లీగ్ గెలవలేదు. పీఎస్జీ ఏడాదికి 3.5 కోట్ల యూరోలు (సుమారు రూ.300 కోట్లు) మెస్సీకి చెల్లించనున్నట్లు సమాచారం. మెస్సీలాంటి స్టార్ ప్లేయర్ తమ టీమ్లో చేరుతుండటంతో పీఎస్జీ అభిమానులు అతనికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పటికే బ్రెజిల్కు చెందిన నెయ్మార్ కూడా ఇదే టీమ్లో ఉన్నాడు.