యోచియోన్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత యువ ఆర్చర్ ప్రథమేశ్.. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో సెమీస్కు ప్రవేశించాడు. గురువారం జరిగిన క్వార్టర్స్ పోరులో 146-145 తో నికో వీనర్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. సెమీఫైనల్స్లో అతడు.. యూఎస్ఎ ఆర్చర్ జేమ్స్ లుట్జ్తో ఢీకొననున్నాడు.
మహిళల వ్యక్తిగత కాంపౌండ్ క్వార్టర్స్లో జ్యోతి సురేఖ వెన్నం.. 142-145 తో సారా లోపెజ్ చేతిలో ఓడింది. పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్ మొదటి మ్యాచ్లో కెనడా త్రయం ఎరిక్, బ్రాండన్, రీస్ విల్సన్.. 5-3 తేడాతో తరుణ్దీప్, ధీరజ్, మృణాల్ చౌహాన్ను ఓడించారు.