ఫోర్ట్వర్త్ : డబ్ల్యుటిఏ ఫైనల్స్లో టాప్ ర్యాంకర్ ఇగా సియాటెక్, ఆరో ర్యాంకర్ కరోలినా గార్సియా ముందంజ వేశారు. మంగళవారం జరిగిన పోటీలలో సియాటెక్ 6-2, 6-3 స్కోరుతో డారియా కసట్కినాపై గెలుపొందింది. ఈ సీజన్లో మేటి ప్రదర్శనతో దూసుకుపోతున్న సియాటెక్ రెండు గ్రాండ్స్లామ్ టోర్నీలు, ఎనిమిది ఇతర టోర్నీలలో విజేతగా నిలిచింది. ఇక కసట్కినాపై 5-0 ఆధిక్యం ప్రదర్శించింది. మరో మ్యాచ్లో కరోలిన్ గార్సియా 6-4, 6-3తో అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్పై గెలుపొందింది. రౌండ్రాబిన్ పద్ధతిలో నిర్వహించే ఈ టోర్నీలో సియాటెక్ తదుపరి ప్రత్యర్థి గార్సియానే.