సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదని ఆకాష్ చెప్పాడు.
ఆ తర్వాత స్పిన్నర్ అక్షర్ పటేల్ నిరాశ పరిచాడని అన్నాడు. ‘‘రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ దాదాపు ఒకేలాంటి ఆటగాళ్లు. వీళ్లిద్దరిలో అక్షర్ బాగా వెనుకపడ్డాడు’’ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్లలో జడేజా కొంత మెరుగ్గా కనిపిస్తున్నాడన్నాడీ మాజీ క్రికెటర్.
అలాంటి జడ్డూ స్థానంలో ఆడాలంటే బలమైన ప్రదర్శనలు ఇవ్వాలని చెప్పిన ఆకాష్ చోప్రా.. సౌతాఫ్రికా సిరీస్లో తనకు దక్కిన అవకాశాలను అక్షర్ ఏమాత్రం ఉపయోగిచుకోలేకపోయాడని పేర్కొన్నాడు. మరి ఐర్లాండ్తో జరిగే సిరీస్లో అయినా అతను రాణిస్తాడేమో చూడాలి.