వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన చివరి టీ20లో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్కు ముందు అతడు గతనెల ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కూడా కెప్టెన్గా పనిచేశాడు. ఐపీఎల్లో కొత్తగా చేరిన గుజరాత్ టైటాన్స్కు సారథిగా వ్యవహరించి ఆ జట్టుకు ట్రోఫీ కూడా అందజేశాడు. అయితే తాజాగా అతడు భారత జట్టుకు ఫుల్ టైం కెప్టెన్గా ఉండటంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విండీస్తో చివరి మ్యాచ్ అనంతరం పాండ్యాకు ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి హార్ధిక్ సమాధానం చెబుతూ.. ‘అవును! ఎందుకు కాదు. భవిష్యత్లో నాకు ఆ అవకాశం వస్తే నేను చాలా సంతోషిస్తా. కానీ ప్రస్తుతం నా దృష్టంతా ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ మీదే ఉంది..
ప్రస్తుతానికి మేము మా భవిష్యత్ ప్రణాళికలు సాధించడానికి బృందంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు మేం నేర్చుకుంటున్న నైపుణ్యాలన్నీ మమ్మ ల్ని మేం మెరుగుపరుచుకోవడానికే.. అంతేగాక మా ఆటను మేం ఎంతగానో ఆస్వాదిస్తున్నాం..’ అని తెలిపాడు.
వెస్టిండీస్తో ముగిసిన చివరి టీ20లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత విండీస్.. 15.4 ఓవర్లలోనే వంద పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ల దాటికి విండీస్ విలవిల్లాడింది.