Gabba Redevelopment: ప్రపంచ క్రికెట్లో పలు దేశాలలో ప్రఖ్యాత పొందిన స్టేడియాలు ఉన్న కొన్ని మాత్రం వాటి చరిత్ర, అక్కడ జరిగిన మ్యాచ్లు, వంటి విషయాలలో చాలా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉండే స్టేడియాలలో బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం ముందువరుసలో ఉంటుంది. 1895వ సంవత్సరంలోనే ఇక్కడ తొలి క్రికెట్ మ్యాచ్ జరిగినట్టు చరిత్ర చెబుతోంది. అధికారికంగా 1931 నుంచి క్రికెట్ పోటీలతో పాటు రగ్బీ, ఫుట్బాల్, బేస్బాల్, సైక్లింగ్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న గబ్బాను త్వరలోనే నేలమట్టం చేసి దాని స్థానంలో కొత్త స్టేడియాన్ని పునర్నిర్మించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అసోసియేటెడ్ ప్రెస్లో వచ్చిన కథనం మేరకు.. 2032 ఒలింపిక్స్కు బ్రిస్బేన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో బ్రిస్బేన్ స్టేడియాన్ని పునర్నిర్మేంచుందకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు క్వీన్స్లాండ్ స్టేట్ డిప్యూటీ ప్రీమియర్ స్టీవెన్ మైల్స్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రిస్బేన్లో నిర్వహించబోయే ఒలింపిక్స్లో ఇదే ప్రధాన స్టేడియం కానుంది. సుమారు 50వేల మందికి సీటింగ్ కెపాజిటీని కల్పిస్తూ నిర్మించబోయే ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు సుమారు 2.7 ఆస్ట్రేలియా బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు మైల్స్ తెలిపారు. బ్రిస్బేన్ ఒలింపిక్స్లో ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు పలు అథ్లెటిక్స్ పోటీలను కూడా ఇక్కడే నిర్వహించనున్నారు.
The Queensland Government has provided an update on the Gabba redevelopment.https://t.co/SLST2AMBPS
— Brisbane Lions (@brisbanelions) November 24, 2023
శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న ఈ స్టేడియం 2025కు ముందు యాషెస్ సిరీస్లో భాగంగా ఇక్కడ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత గబ్బాను కూలగొట్టనున్నట్టు తెలుస్తున్నది. ఆస్ట్రేలియాలో 1956లో సిడ్నీ, 2000లో మెల్బోర్న్ తర్వాత బ్రిస్బేన్ ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వనున్నది.