Yashasvi Jaiswal | దుబాయ్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్న భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ దుమ్మురేపుతున్నాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో జైస్వాల్ 12వ స్థానానికి ఎగబాకాడు.
ఈ సిరీస్ ఆరంభానికి ముందు 69వ స్థానంలో ఉన్న జైస్వాల్.. ఒక్కో మ్యాచ్కు ప్రదర్శన మెరుగు పర్చుకుంటూ ర్యాకింగ్స్లో దూసుకెళ్తున్నాడు. రాంచీ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 69వ స్థానం దక్కించుకున్నాడు.