దుబాయ్: ఇటీవల నిలకడగా రాణిస్తున్న టీమ్ఇండియా యువ ఆటగాళ్లు అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ తొలిసారి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్లో అక్షర్ పటేల్ కెరీర్ అత్యుత్తమ ఐదో స్థానం దక్కించుకోగా.. ఓపెనర్ జైస్వాల్ ఆరో ప్లేస్లో నిలిచాడు.
అఫ్గానిస్థాన్తో సిరీస్లో సత్తాచాటిన ఈ ఇద్దరూ బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నారు.