ODI WC 2023 : ఆసియా కప్(Asia cup 2023) వేదిక విషయమై భారత్(BCCI), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో, తాము వన్డే వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామని పీసీబీ చీఫ్ నజం సేథీ(Najam Sethi) ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాడు. దాంతో, ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) సీరియస్గా తీసుకుంది. దాంతో, ఐసీసీ ఐసీసీ చీఫ్ గ్రెగ్ బార్క్లే, సీఈఓ జియోఫ్ అల్లర్డిసే పాకిస్థాన్ వెళ్లారు. భారత్లో వరల్డ్ కప్ ఆడే విషయమై పీసీబీ అధ్యక్షుడి నుంచి స్పష్టమైన వాగ్దానం తీసుకోనున్నారు. అంతేకాదు వరల్డ్ కప్ మ్యాచ్లను ఇండియాలో కాకుండా హైబ్రిడ్ వేదికపై నిర్వహించాలని పట్టుపట్ట వద్దని నజం సేథీని కోరనున్నారు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్లో భారత్లో జరగనుంది. అక్టోబర్ – నవంబర్ మధ్యలో టోర్నీ ఉంటుంది. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. అయితే.. రాజకీయ ప్రయోజనం కోసం అహ్మదాబాద్లో భారత్, పాక్ మ్యాచ్ నిర్వహించడాన్ని పీసీబీ చీఫ్ తప్పుపట్టాడు. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టు భారత పర్యటనకు రాదని, ఒకవేళ వచ్చినా అహ్మదాబాద్లో మాత్రం ఆడదని అతను తెలిపాడు. దాంతో, రంగంలోకి దిగిన ఐసీసీ పెద్దలు పీసీబీ అధ్యక్షుడిని ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.
ఐసీసీ ఐసీసీ చీఫ్ గ్రెగ్ బార్క్లే, సీఈఓ జియోఫ్
షెడ్యూల్ ప్రకారం అయితే.. ఈసారి ఆసియా కప్((Asia cup 2023)) పాకిస్థాన్లో జరగాలి. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి టీమిండియాను పంపబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దాంతో, పీసీబీ అధ్యక్షుడు నజం సేథీతో సహా పాక్ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భారత జట్టు తమదేశంలో ఆసియా కప్ ఆడకుంటే తమ జట్టు వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు రాదని ప్రకటించారు. అక్కడితో మొదలు వేదిక గురించి వివాదం నడుస్తూనే ఉంది. అయితే.. గత సీజన్కు ఆతిథ్యం ఇచ్చిన శ్రీలంకలోనే ఈసారి టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ నేటితో ముగియనుంది. ఆవిషయమై తర్వాత ఆసియా కప్ను ఎక్కడ జరపాలి? అనే విషయమై బీసీసీఐ, ఏసీసీ సర్వ సభ్య సమావేశంలో చర్చించనుంది.