భారత్-న్యూజిల్యాండ్, పాక్-బంగ్లా, శ్రీలంక-విండీస్ టెస్టు సిరీసుల్లో తొలి మ్యాచులు ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకులు విడుదలయ్యాయి. ఈ ర్యాకింగ్స్లో టాప్ టెన్ బ్యాట్స్మెన్ల జాబితాలో కివీ కెప్టెన్ కేన్విలియమ్సన్ను వెనక్కు నెట్టి, ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి ఎగబాకాడు.
తొలి స్థానంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ కొనసాగుతున్నాడు. నాలుగో స్థానంలో మార్నస్ లబుషాగ్నే ఉండగా.. ఐదో స్థానంలో రోహిత్ శర్మ, ఆరో ర్యాంకులో విరాట్ కోహ్లీ ఉన్నారు. శ్రీలంక టెస్టు కెప్టెన్ డిముత్ కరుణరత్నే 7వ స్థానంతో తొలిసారి టాప్టెన్లో చోటుదక్కించుకున్నాడు.
బౌలర్ల విషయానికొస్తే.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంకులో ఉన్నాడు. పాక్ పేస్ తురుపుముక్క షహీన్ షా అఫ్రిదీ తొలిసారి టాప్-5లో చోటుదక్కించుకున్నాడు.
అతను ఐదో ర్యాంకులో నిలిచాడు. న్యూజిల్యాండ్తో టెస్టు మిస్ అయిన భారత పేస్ హీరో జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం కోల్పోయి పదో ర్యాంకులో నిలిచాడు. న్యూజిల్యాండ్పై అద్భుతంగా రాణించిన శ్రేయాస్ అయ్యర్ కూడా తన ర్యాంకును భారీగా మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం అతను 74వ ర్యాంకులో ఉన్నాడు.