Usman Khawaja: ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. తొలి టెస్టులో ఐసీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిరసన వ్యక్తం చేసినందుకు గాను ఖవాజాను మందలించింది. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. పాకిస్తాన్తో ఇటీవలే పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో పాలస్తీనాకు మద్దతుగా ‘ఫ్రీడమ్ ఈజ్ హ్యూమన్ రైట్.. ఆల్ ఆర్ ఈక్వల్’ అని రాసిఉన్న షూ వేసుకునేందుకు ఐసీసీ అంగీకరించకపోవడంతో ఖవాజా.. తన షర్ట్పై నల్ల బ్యాండ్ ధరించి నిరసన వ్యక్తం చేశాడు.
పెర్త్ టెస్టుకు ముందే ఖవాజా.. తాను పాలస్తీనాకు మద్దతు తెలపాలనుకుంటున్ననని, ఒక వ్యక్తిగా అది తన హక్కు అని ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా షేర్ చేశాడు. ఐసీసీ తనకు నచ్చిన షూ వేసుకునేందుకు అంగీకారం తెలపకపోవడంతో నిరాశచెందిన ఖవాజా.. జెర్సీపై బ్లాక్ ఆర్మ్ బ్యాండ్ ధరించి మ్యాచ్ ఆడాడు. ఇది ఐసీసీకి ఆగ్రహం తెప్పించింది. ఇది అతడి వ్యక్తిగత విషయమని, తాము వద్దని చెప్పినా వినలేదని ఐసీసీ తెలిపింది.
పెర్త్ టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్లో సెంచరీ మిస్ అయినా ఖవాజా తన ఫామ్ను కొనసాగించాడు. తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఆసీస్.. ఈనెల 26 నుంచి పాకిస్తాన్తో రెండో టెస్టు ఆడాల్సి ఉంది.