దుబాయ్: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నవంబర్ నెల రేసులో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ బ్యాటర్ అబిద్ అలీ, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ ఉన్నారు. పురుషుల కేటగిరీలో ఆ ముగ్గురిని.. మహిళల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ ఆనమ్ అమిన్, బంగ్లా బౌలర్ నహిద అక్తర్, వెస్టిండీస్ ఆల్రౌండర్ హలే మాథ్యూస్ ఐసీసీ మంగళవారం నామినేట్ చేసింది. ఈ జాబితాలో మాథ్యూస్ రెండో సారి చోటు దక్కించుకోవడం విశేషం.