ఆగస్టు 15.. భారత స్వాతంత్ర్య దినోత్సవమే కాదు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన ఎం.ఎస్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రోజు కూడా. 2020లో సరిగ్గా ఇదే రోజున ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు పుల్స్టాప్ పెట్టేశాడు. తన కెరీర్లో ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్గా ధోనీ చరిత్ర సృష్టించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మూడింటా గెలిచాడు. అంతేకాదు, అన్ని ఫార్మాట్లలో భారత్ను నెంబర్ వన్గా నిలిపాడు. అలాంటి ధోనీ క్రికెట్ కెరీర్ను గుర్తుచేస్తూ.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అద్భుతమైన వీడియోను పంచుకుంది. మొత్తమ్మీద మూడు నిమిషాలపైగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.