న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్కప్(ICC ODI World Cup) ఇండియాలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మెగా టోర్నీకి చెందిన పూర్తి షెడ్యూల్ను ఇంకా ఐసీసీ రిలీజ్ చేయలేదు. కానీ ఫైనల్, సెమీస్ మ్యాచ్లు ఎక్కడ జరుగుతాయన్న దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ను అహ్మాదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi stadium)లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెమీస్ మ్యాచ్ను ముంబైలో నిర్వహించే ప్లాన్లో ఉన్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి.
అయితే టోర్నీకే హైలెట్గా నిలిచే ఇండోపాక్(Ind vs Pak) మ్యాచ్కు చెందిన ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వరల్డ్కప్లో ఇండియా, పాక్ జట్లు తలపడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించాలనుకుంటున్నారు. వీలైతే బంగ్లాదేశ్ స్టేడియాల్లో ఆ మ్యాచ్లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కుదిరితే ఇండోపాక్ మ్యాచ్లను ఢిల్లీ లేదా చెన్నై స్టేడియాల్లోనూ నిర్వహించే ఛాన్సు ఉన్నట్లు క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వరల్డ్కప్లో మొత్తం 48 మ్యాచ్లు ఉండనున్నాయి. ఆ మ్యాచ్లను నిర్వహించేందుకు 12 వేదికల(venue)ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.