న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్నకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ‘గ్లోబల్ అంబాసిడర్’గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) మంగళవారం వివరాలు వెల్లడించింది. భారత జట్టు తరఫున 6 ప్రపంచకప్లు ఆడిన సచిన్.. గురువారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న 13వ వరల్డ్కప్ తొలి మ్యాచ్కు ముందు ట్రోఫీని ఆవిష్కరించి టోర్నీ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించనున్నాడు.
‘నా మనసులో ఆ ట్రోఫీకి ప్రత్యేక స్థానం ఉంది. 1987 నుంచి 6 సార్లు వరల్డ్ కప్ ఆడా. 2011లో విశ్వవిజేతగా నిలువడం నా కెరీర్లోనే అత్యంత గొప్ప క్షణం’ అని సచిన్ పేర్కొన్నాడు. సచిన్తో పాటు మరో తొమ్మిది మంది ఈ వరల్డ్కప్కు అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.