India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. దీంతో 27 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ను కోల్పోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (18*), శ్రేయాస్ అయ్యర్ (0*) క్రీజ్లో ఉన్నారు. ఇక 8 ఓవర్లు ముగిసే సరికి టీమ్ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే జట్టుకు మరోసారి శుభారంభాన్ని అందిస్తారనుకున్న టీమ్ఇండియా ఓపెనింగ్ జోడీని ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ నిలువరించాడు. ఒక ఫోర్ కొట్టి ఊపుమీదున్న గిల్(09)ను ఇన్నింగ్ 3వ ఓవర్లో క్రిస్ వోక్స్ తన చివరి బంతికి ఔట్ చేశాడు. దీంతో జట్టు స్కోరు 26 రన్స్ వద్ద తొలివికెట్ కోల్పోయింది.