ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మరో గౌరవం దక్కింది. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా గంగూలీని ఐసీసీ బోర్డు నియమించింది. అనిల్ కుంబ్లే మూడేళ్ల పదవీకాలం ముగియడంతో ఆ పదవి నుంచి అతను తప్పుకున్నాడు. ఆ స్థానంలో గంగూలీని నియమిస్తూ ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఐసీసీ చైర్మెన్ గ్రెగ్ బార్క్లే ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ను ఆహ్వానించేందుకు సంతోషిస్తున్నామని, తొలుత ఉత్తమ క్రికెటర్గా.. ఆ తర్వాత బోర్డు అడ్మినిస్ట్రేటర్గా గంగూలీ అనుభవాలు క్రికెట్ వృద్ధికి ఉపయోగపడుతాయని గ్రెగ్ అన్నారు. అనిల్ కుంబ్లే మూడు పర్యాయాలు, అంటే తొమ్మిదేళ్లు మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్గా అద్భుతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించినట్లు గ్రెగ్ తెలిపారు. క్రికెట్లో డీఆర్ఎస్ అప్లికేషన్, బౌలింగ్ యాక్షన్పై అనిల్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.