అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐఃసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 క్రికెట్లో రెండు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. క్రికెట్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ సమస్య చాలా కాలంగా ఉంది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని జట్టుకు మ్యాచ్ ఫీజులో కోత విధించడం ఇప్పటి వరకూ జరుగుతూ వస్తోంది.
అయితే ధనవంతులైన క్రికెటర్లు, బోర్డులకు ఇది పెద్ద సమస్యే కాదని చాలా మంది వాదిస్తూ వచ్చారు. స్లో ఓవర్ రేటు విషయంలో మ్యాచ్ ఫీజులో కోత గురించి చాలా మంది క్రికెటర్లు పట్టించుకునేవారు కాదు కూడా. ఈ క్రమంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈఃసీబీ) నిర్వహించిన హండ్రెడ్ టోర్నీలోని నిబంధనలను ఐసీసీ గుర్తించింది.
ఈ టోర్నీలో స్లో ఓవర్ రేటుకు పాల్పడిన జట్టు బౌండరీ లైన్ వద్ద ఒక ఫీల్డర్ను కోల్పోయేలా నిబంధనలు విధించారు. ఇదే రూల్ను టీ20 క్రికెట్లో తీసుకొస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. టీ20 మ్యాచ్లో తొలి పవర్ప్లే తర్వాత 30-యార్డ్ సర్కిల్ అవతల ఐదుగురు ఫీల్డర్లకు అనుమతి ఉంటుంది.
అయితే కొత్త నిబంధన ప్రకారం, ఒక మ్యాచ్ 7.30కు ముగియాల్సి ఉందనుకుందాం. కానీ ఆ టైంకు బౌలింగ్ జట్టు 17 ఓవర్లే వేసింది. అప్పుడు ఆ జట్టు మిగతా మూడు ఓవర్ల పాటు బౌండరీ లైన్ వద్ద ఒక ఫీల్డర్ను తగ్గించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం చాలా మంచిదని, మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఈ నిబంధన వల్ల స్లో ఓవర్ రేట్ను అన్ని జట్లూ సీరియస్గా తీసుకుంటాయని కొందరు అంటున్నారు.
అదే విధంగా, ఐపీఎల్లో జట్లు 2.30 నిమిషాలపాటు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకుంటాయని తెలుసు కదా. ఇలానే మ్యాచ్ ముందు ఇరుజట్ల ఒప్పందం ప్రకారం 10 ఓవర్ల తర్వాత టైమ్ అవుట్ తీసుకునే అవకాశాన్ని ఐసీసీ కల్పించింది.