శంకర్పల్లి: ఐబీఎస్-ఐసీఎఫ్ఏఐలో స్పోర్ట్స్ ఫెస్టివెల్ ఘనంగా మొదలైంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి గ్రామ శివారులో ఉన్న కాలేజీలో టీమ్ వీఏపీఎస్ ఆధ్వర్యంలో ఏఏవీఈజీ -13 పేరిట మూడు రోజుల పాటు ఆటపాటలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అట్టహాసంగా జరిగిన ప్రారంభ కార్యక్రమానికి భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్ఫాయ్ కాలేజీ బ్రాంచీలైన బెంగళూరు, ముంబై, హైదరాబాద్లోని సింబయాసిస్, ఐఎమ్టీ 15 కాలేజీల నుంచి విద్యార్థులు ఈ ఫెస్టివెల్లో పాల్గొంటున్నారు. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్, లాంగ్టెన్నిస్, టీటీ, స్కాష్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి 11 క్రీడాంశాల్లో విద్యార్థులు పోటీపడనున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణించగల్గుతాం. విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించే దిశగా పయనించాలి. తొలుత క్రికెటర్ కావాలనుకున్నా.. పరిస్థితుల దృష్ట్యా బ్యాడ్మింటన్ నేర్చుకున్నాను. 2002లో కెరీర్కు వీడ్కోలు పలికి కోచింగ్ వైపు మళ్లాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ సీఎస్ శైలజన్, మాధవి గరికపార్థి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ ఫెస్టివెల్కు నమస్తే తెలంగాణ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్నది.