న్యూఢిల్లీ: స్కూల్కు వెళ్తున్న రోజుల్లో తాను ఓ యావరేజ్ స్టూడెంట్ని అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. ఓ స్కూల్ ఈవెంట్లో పాల్గొన్న అతన్ని విద్యార్థులు ప్రశ్నించగా అతను ఈ సమాధానం ఇచ్చాడు. ఓ దశలో తాను టెన్త్ క్లాస్ పాస్ అవుతానో లేదో అన్న భయం తన తండ్రిలో ఉండేదన్నారు.
ఏడవ తరగతి చదువుతున్న సమయంలో క్రికెటర్గా మారానని, ఆ తర్వాత ఎక్కువ మ్యాచ్లు ఆడడం వల్ల స్కూల్లో అటెండెన్స్ తక్కువైందన్నాడు. మీ ఫెవరేట్ సబ్జెక్ట్ ఏంటని ఓ విద్యార్థిని ప్రశ్నించగా.. స్పోర్ట్స్ ఓ సబ్జెక్ట్గా క్వాలిఫై అవుతుందా అని ధోనీ అడిగారు. తనకు టెన్త్లో 66 శాతం మార్కులు వచ్చాయని, ఇక 12వ తరగతిలో 56 నుంచి 57 శాతం మార్కులు వచ్చినట్లు గుర్తు ఉందన్నారు.
నేను టెన్త్ పాస్ కానన్న ఆలోచనలో మా నాన్న ఉన్నారని, కానీ తాను పాస్ కావడం వల్ల తన తండ్రి సంతోషించినట్లు ధోనీ తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పిల్లలు అడిగిన ప్రశ్నలకు ధోనీ ఇచ్చిన సమాధానాలకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడండి.
'My father thought I won't pass the school board exam' – @MSDhoni 😁pic.twitter.com/fvclSbnvGH
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) October 10, 2022