Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో తో పాటు క్రికెట్కు కూడా పెద్ద ఫ్యాన్. భారత క్రికెటర్లతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. మరి ఈ యువ అథ్లెట్కు నచ్చిన భారత క్రికెటర్ ఎవరు..? అన్న ప్రశ్నకు స్వయంగా అతడే సమాధానం చెప్పాడు. భారత జట్టులో తనకు బుమ్రా అంటే ఇష్టమని, అతడి బౌలింగ్ యాక్షన్ కూడా వినూత్నంగా ఉంటుందని నీరజ్ అన్నాడు. ఇటీవలే బెంగళూరుకు ఓ కార్యక్రమం నిమిత్తం విచ్చేసిన నీరజ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రతినిధితో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నీరజ్ మాట్లాడుతూ.. `టీమిండియాలో నాకు బుమ్రా అంటే ఇష్టం. అతడి బౌలింగ్ యాక్షన్ యూనిక్గా ఉంటుంది. కానీ అతడు తన రనప్ను మరింత పెంచుకుంటే బాగుంటుంది. రనప్ ఎక్కువ ఉంటే అతడి బౌలింగ్లో వేగం కూడా పెరుగుతుంది. ఒక జావెలిన్ త్రోయర్గా మేము నిత్యం బౌలర్ల రనప్ గురించి ఎక్కువగా చర్చిస్తాం..` అని చెప్పాడు.
Rapid Fire with Neeraj Chopra 🔥
We threw some fun questions at India’s Javelin Ace amid formalities at the #RCBxLeaders event! 🗣️#PlayBold #ನಮ್ಮRCB #RCB @LeadersBiz @Neeraj_chopra1 pic.twitter.com/TKH5Abo79V
— Royal Challengers Bangalore (@RCBTweets) November 30, 2023
తాను గతంలో క్రికెట్ ఆడేప్పుడు ఎక్కువగా బౌలింగ్ చేసేవాడినని చెప్పిన నీరజ్కు నచ్చిన స్పోర్ట్స్ మూవీ ఫర్హాన్ అక్తర్ నటించిన బాగ్ మిల్కా బాగ్ అని చెప్పాడు. భారత జట్టులో బుమ్రా తర్వాత తనకు నచ్చిన స్టైలిష్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ అని తెలిపాడు.